మీడియాకు క్షమాపణలు చెప్పిన జక్కన్న
- December 09, 2021
ముంబై: దర్శక ధీరుడు రాజమౌళి మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ మారుమ్రోగిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు .. హీరోల ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ టీం ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు.. అయితే హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న తెలుగు ట్రైలర్ అనంతరం ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేశారు.
మీడియాను ఆహ్వానించిన తరువాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయడంతో మీడియాకు జక్కన్న క్షమాపణలు కోరారు. “ప్రెస్మీట్ అనుకున్నా.. అయితే ఫ్యాన్స్ కూడా రావడంతో మీడియాకు ఇబ్బంది అయింది, అందుకే హీరోలను తీసుకురాలేదు.రెండు రోజుల్లో మీడియాకు ప్రత్యేక సమావేశం ఉంటుంది.ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసినందుకు క్షమించాలి” అని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







