వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోండి..లేదంటే హ్యాకయ్యే ప్రమాదముందన్న సెక్యూరిటీ అథారిటీ
- December 10, 2021
సౌదీ: వాట్సాప్ యూజర్స్ వెంటనే తమ వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ అనుబంధ సంస్థ అయిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ గైడెన్స్ సెంటర్ సూచించింది. ప్రస్తుత వాట్సాప్ యాప్ లో యూజర్ల డేటాకు ప్రమాదం ఉందని హెచ్చరించింది. సౌదీ లో వాట్సాప్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను హ్యాకర్లు సులువుగా ఉపయోగించుకునేలా ఉందన్నారు. ఆండ్రాయిడ్ 2.21.22.7, ఆండ్రాయిడ్ 2.21.22.7 కోసం వాట్సాప్ అప్డేట్ను విడుదల చేసినట్లు వివరించింది. వాట్సాప్ లో ఇమేజ్ ను పంపుతున్న హ్యాకర్లు.. దాన్ని తెరవగానే యజర్ డేటాతోపాటు నెట్వర్క్ లు, పరికరాల యాక్సెస్ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాట్సాప్ అప్ డేట్ కోసం.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ అని సెర్చ్ చేసి.. ఆపై 'అప్డేట్' బటన్ ను నొక్కాల్సి ఉంటుందని చెప్పింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







