వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోండి..లేదంటే హ్యాకయ్యే ప్రమాదముందన్న సెక్యూరిటీ అథారిటీ
- December 10, 2021
సౌదీ: వాట్సాప్ యూజర్స్ వెంటనే తమ వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ అనుబంధ సంస్థ అయిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ గైడెన్స్ సెంటర్ సూచించింది. ప్రస్తుత వాట్సాప్ యాప్ లో యూజర్ల డేటాకు ప్రమాదం ఉందని హెచ్చరించింది. సౌదీ లో వాట్సాప్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను హ్యాకర్లు సులువుగా ఉపయోగించుకునేలా ఉందన్నారు. ఆండ్రాయిడ్ 2.21.22.7, ఆండ్రాయిడ్ 2.21.22.7 కోసం వాట్సాప్ అప్డేట్ను విడుదల చేసినట్లు వివరించింది. వాట్సాప్ లో ఇమేజ్ ను పంపుతున్న హ్యాకర్లు.. దాన్ని తెరవగానే యజర్ డేటాతోపాటు నెట్వర్క్ లు, పరికరాల యాక్సెస్ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాట్సాప్ అప్ డేట్ కోసం.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ అని సెర్చ్ చేసి.. ఆపై 'అప్డేట్' బటన్ ను నొక్కాల్సి ఉంటుందని చెప్పింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







