ఒమిక్రాన్ ను డోంట్ కేర్ అంటున్న కువైటీలు...ప్రయాణాలకే మొగ్గు
- December 10, 2021
కువైట్: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలు క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ కోసం ప్రయాణ ప్రణాళికలను వేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతృప్తిగా ఉన్న ప్రజలు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. కొత్త వేరియంట్ పై ప్రజల్లో అవగాహన పెరగడంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణ పరిమితులను సడలించింది. ఫెడరేషన్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీసుల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మహమ్మద్ అల్-ముతైరీ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల కోసం ప్రయాణ రిజర్వేషన్లు పెరిగాయన్నారు. లండన్, టర్కీ, రియాద్, జెద్దా, దుబాయ్లకు వెళ్లేందుకు కువైటీలు ఎక్కువగా ఇష్టపడతారని, ఆ రూట్లలోనే ఎక్కువగా రిజర్వేషన్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









