దోహా-ఖతార్ తెలంగాణ ఎన్నారై ప్రొఫెషనల్స్ చే "వేకువ ఫౌండేషన్" స్థాపన
- June 08, 2015
ఖతార్ తెలంగాణ ప్రవాసీ ప్రతినిధులు కర్ర రాజేష్, గడ్డల రాజేశం, మాతంగి సతీష్ 8 జూన్ 2015 న హైదరాబాద్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
జూన్ 11న "వేకువ ప్రారంభ వేడుక” మరియు “తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం” దోహా- ఖతార్ లో జరుపుకోనున్నారు విధ్య, నైపుణ్యం మరియు ఉపాధి అంశాలపై సాద్యమైనంత తమ సహకారం అందజేసి మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అని వీరు బలంగా నమ్ముతూ, మాతృభూమికి సేవచేసే అవకాశంగా భావిస్తున్నారు.
"వేకువ" సంస్థ తెలంగాణ వ్యాప్తంగా "మేధ "ప్రాజెక్ట్ ద్వారా 40 పాఠశాలలు ఎంపిక చేసి అందులో ఉన్న 5,000 కు పైగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
తదుపరి ప్రాజెక్ట్ “ప్రేరణ” ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 80 నుండి 100 ప్రాంతాలలో, ఒక్కో ప్రాంతానికి 500 మంది విద్యార్థుల చొప్పున ఈ విధ్యా సంవత్సరంలో 50000 మంది విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి అనుభజ్ఞులైన మనోవికాస నిపుణలచే ప్రేరణ తరుగతులు నిర్వహించడం జరుగుతుంది.
ప్రాజెక్ట్ “లక్ష్య” ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రేరణ కలిగించడానికి మా సభ్యులు, వారి మిత్రులు మరియు వారి బంధువులచే రూపొందించబడిన కార్యక్రమం. మా సభ్యుల భారతదేశ పర్యటనలో వారు తెలంగాణలో గడిపే సమయంలో వారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2280 వసతి గృహాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు.
--యం.భీం రెడ్డి(జగిత్యాల్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







