దోహా-ఖతార్ తెలంగాణ ఎన్నారై ప్రొఫెషనల్స్ చే "వేకువ ఫౌండేషన్" స్థాపన
- June 08, 2015
ఖతార్ తెలంగాణ ప్రవాసీ ప్రతినిధులు కర్ర రాజేష్, గడ్డల రాజేశం, మాతంగి సతీష్ 8 జూన్ 2015 న హైదరాబాద్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
జూన్ 11న "వేకువ ప్రారంభ వేడుక” మరియు “తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం” దోహా- ఖతార్ లో జరుపుకోనున్నారు విధ్య, నైపుణ్యం మరియు ఉపాధి అంశాలపై సాద్యమైనంత తమ సహకారం అందజేసి మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అని వీరు బలంగా నమ్ముతూ, మాతృభూమికి సేవచేసే అవకాశంగా భావిస్తున్నారు.
"వేకువ" సంస్థ తెలంగాణ వ్యాప్తంగా "మేధ "ప్రాజెక్ట్ ద్వారా 40 పాఠశాలలు ఎంపిక చేసి అందులో ఉన్న 5,000 కు పైగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
తదుపరి ప్రాజెక్ట్ “ప్రేరణ” ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 80 నుండి 100 ప్రాంతాలలో, ఒక్కో ప్రాంతానికి 500 మంది విద్యార్థుల చొప్పున ఈ విధ్యా సంవత్సరంలో 50000 మంది విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి అనుభజ్ఞులైన మనోవికాస నిపుణలచే ప్రేరణ తరుగతులు నిర్వహించడం జరుగుతుంది.
ప్రాజెక్ట్ “లక్ష్య” ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రేరణ కలిగించడానికి మా సభ్యులు, వారి మిత్రులు మరియు వారి బంధువులచే రూపొందించబడిన కార్యక్రమం. మా సభ్యుల భారతదేశ పర్యటనలో వారు తెలంగాణలో గడిపే సమయంలో వారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2280 వసతి గృహాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు.
--యం.భీం రెడ్డి(జగిత్యాల్)
తాజా వార్తలు
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!









