200,000 బహ్రెయినీ దినార్లను దొంగిలించిన మహిళ భవిష్యత్ తేలనున్నది నేడే
- December 14, 2021
బహ్రెయిన్: ఆసియా జాతీయురాలైన ఓ మహిళ, తాను పని చేస్తున్న సంస్థ నుంచి 200,000 బహ్రెయినీ దినార్లను దొంగిలించగా, ఈ కేసులో ఆమె భవితవ్యం నేడు తేలనుంది. 2014 నుంచి 2020 మధ్యలో ఈ దొంగతనం జరిగింది. వినియోగదారుల నుంచి సొమ్ముల్ని వసూలు చేసే క్రమంలో నిందితురాలు మోసానికి పాల్పడింది. వీడియో ప్రొడక్షన్ వ్యవహారాల్ని సదరు సంస్థ నిర్వహిస్తూ వస్తోంది. పలు భవనాలు కూడా ఆ సంస్థకు వున్నాయి. అద్దెలు, ఇతరత్రా మార్గాల్లో సంస్థకు వచ్చే సొమ్ముల్ని వసూలు చేయడం ఆమె బాధ్యత. ఈ క్రమంలోనే ఆమె ఈ దొంగతనానికి పాల్పడింది. తన కుటుంబ సభ్యులకు, ఇతర స్నేహితులకు ఆమె దోచేసిన సొమ్ముని ఇచ్చినట్లుగా గుర్తించారు. ఆమెకు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇప్పటికే న్యాయస్థానం తీర్పునివ్వగా, దాన్ని ఆమె అప్పీల్ మార్గంలో సవాల్ చేశారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









