200,000 బహ్రెయినీ దినార్లను దొంగిలించిన మహిళ భవిష్యత్ తేలనున్నది నేడే
- December 14, 2021
బహ్రెయిన్: ఆసియా జాతీయురాలైన ఓ మహిళ, తాను పని చేస్తున్న సంస్థ నుంచి 200,000 బహ్రెయినీ దినార్లను దొంగిలించగా, ఈ కేసులో ఆమె భవితవ్యం నేడు తేలనుంది. 2014 నుంచి 2020 మధ్యలో ఈ దొంగతనం జరిగింది. వినియోగదారుల నుంచి సొమ్ముల్ని వసూలు చేసే క్రమంలో నిందితురాలు మోసానికి పాల్పడింది. వీడియో ప్రొడక్షన్ వ్యవహారాల్ని సదరు సంస్థ నిర్వహిస్తూ వస్తోంది. పలు భవనాలు కూడా ఆ సంస్థకు వున్నాయి. అద్దెలు, ఇతరత్రా మార్గాల్లో సంస్థకు వచ్చే సొమ్ముల్ని వసూలు చేయడం ఆమె బాధ్యత. ఈ క్రమంలోనే ఆమె ఈ దొంగతనానికి పాల్పడింది. తన కుటుంబ సభ్యులకు, ఇతర స్నేహితులకు ఆమె దోచేసిన సొమ్ముని ఇచ్చినట్లుగా గుర్తించారు. ఆమెకు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇప్పటికే న్యాయస్థానం తీర్పునివ్వగా, దాన్ని ఆమె అప్పీల్ మార్గంలో సవాల్ చేశారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







