ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు
- December 15, 2021
అబుధాబి: ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టును అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) అండర్ సెక్రటరీ యూసఫ్ సయీద్ అల్ అబ్రి ప్రారంభించారు. అబుధాబి ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముస్లిమేతర కుటుంబ వ్యవహారాలను నియంత్రించే చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూసఫ్ సయీద్ అల్ అబ్రి మాట్లాడుతూ.. ఉప ప్రధాని, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలకు అనుగుణంగా అబుదాబి న్యాయ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగమే కోర్టు ఏర్పాటు అని వివరించారు. కొత్తగా ప్రారంభించిన కోర్టులో ద్విభాషా (అరబిక్, ఇంగ్లీష్)ను అమల్లో ఉంటుందన్నారు. కోర్టు ద్వారా వర్తించే ముస్లిమేతరుల వ్యక్తిగత స్థితి చట్టం, కుటుంబ విషయాల నియంత్రణలో పౌర సూత్రాలను వర్తింపజేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిది అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









