ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు
- December 15, 2021
అబుధాబి: ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టును అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) అండర్ సెక్రటరీ యూసఫ్ సయీద్ అల్ అబ్రి ప్రారంభించారు. అబుధాబి ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముస్లిమేతర కుటుంబ వ్యవహారాలను నియంత్రించే చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూసఫ్ సయీద్ అల్ అబ్రి మాట్లాడుతూ.. ఉప ప్రధాని, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలకు అనుగుణంగా అబుదాబి న్యాయ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగమే కోర్టు ఏర్పాటు అని వివరించారు. కొత్తగా ప్రారంభించిన కోర్టులో ద్విభాషా (అరబిక్, ఇంగ్లీష్)ను అమల్లో ఉంటుందన్నారు. కోర్టు ద్వారా వర్తించే ముస్లిమేతరుల వ్యక్తిగత స్థితి చట్టం, కుటుంబ విషయాల నియంత్రణలో పౌర సూత్రాలను వర్తింపజేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిది అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...







