కువైట్ లో టీచర్లకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్
- December 17, 2021
కువైట్: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ భద్రతను పరిగణనలోకి తీసుకొని ముందు జాగ్రత్తగా కువైట్ వ్యాప్తంగా ఉన్న టీచర్లకు బూస్టర్ డోస్ అందివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు బూస్టర్ డోస్ తీసుకునేలా చొరవ తీసుకోవాలని స్కూల్ మేనేజ్ మెంట్లకు పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అన్ని చోట్ల అందుబాటులో ఉందని, స్థానిక హెల్త్ డిపార్టుమెంట్ అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. అలాగే స్కూళ్లలో నిర్దేశిత కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ... స్కూల్ మేనేజ్ మెంట్లను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







