90,000 మందికి వ్యాక్సినేషన్
- December 17, 2021
కువైట్: గత వారం రోజుల్లో 90,000 మంది పౌరులు అలాగే వలసదారులకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. వీరిలో ఎక్కువమంది బూస్టర్ డోసులు తీసుకున్నవారేనని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. మిష్రీఫ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో గత కొద్ది రోజులుగా వ్యాక్సిన్ల కోసం రద్దీ ఎక్కువవుతోంది. మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వారికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతోంది. ఈ కేంద్రంలో అపాయింట్మెంట్ లేకుండానే వ్యాక్సినేషన్ చేస్తున్నారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారికి మూడో డోసుని బూస్టర్ డోసుగా ఇస్తున్నారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ కేంద్రం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!
- పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్కు జైలు శిక్ష ఖరారు..!!
- కువైట్లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!







