90,000 మందికి వ్యాక్సినేషన్
- December 17, 2021
కువైట్: గత వారం రోజుల్లో 90,000 మంది పౌరులు అలాగే వలసదారులకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. వీరిలో ఎక్కువమంది బూస్టర్ డోసులు తీసుకున్నవారేనని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. మిష్రీఫ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో గత కొద్ది రోజులుగా వ్యాక్సిన్ల కోసం రద్దీ ఎక్కువవుతోంది. మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వారికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతోంది. ఈ కేంద్రంలో అపాయింట్మెంట్ లేకుండానే వ్యాక్సినేషన్ చేస్తున్నారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారికి మూడో డోసుని బూస్టర్ డోసుగా ఇస్తున్నారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ కేంద్రం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







