90,000 మందికి వ్యాక్సినేషన్

- December 17, 2021 , by Maagulf
90,000 మందికి వ్యాక్సినేషన్

కువైట్: గత వారం రోజుల్లో 90,000 మంది పౌరులు అలాగే వలసదారులకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. వీరిలో ఎక్కువమంది బూస్టర్ డోసులు తీసుకున్నవారేనని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. మిష్రీఫ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో గత కొద్ది రోజులుగా వ్యాక్సిన్ల కోసం రద్దీ ఎక్కువవుతోంది. మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వారికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతోంది. ఈ కేంద్రంలో అపాయింట్మెంట్ లేకుండానే వ్యాక్సినేషన్ చేస్తున్నారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారికి మూడో డోసుని బూస్టర్ డోసుగా ఇస్తున్నారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ కేంద్రం పనిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com