అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ విస్తరణ
- March 24, 2016
దుబాయ్ సివిల్ యావియేషన్ అథారిటీ ప్రెసిడెంట్, ఎమిరేట్స్ ఎయిర్లైన్ అండ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్, దుబాయ్ యావియేషన్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, అల్ జబర్ ఎల్ఇజిటి ఇంజనీరింగ్ మరియు కాంట్రాక్టింగ్ ఎల్ఎల్సి (ఎఎల్ఇసి)తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అల్మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాసింజర్ టర్మినల్ బిల్డింగ్ విస్తరణ ఈ ఒప్పందం ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉన్న 66,107 చదరపు మీటర్ల ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ విస్తీర్ణాన్ని 145,926 చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ఇది జూన్ 2017 నాటికి పూర్తవుతుంది. 2025 నాటికి ఎయిర్పోర్ట్లో 26.5 మిలియన్ ప్రయాణీకులకు సౌకర్యాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. షేక్ అహ్మద్ మాట్లాడుతూ, అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్ని 'ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఫ్యూచర్'గా మార్చుతామని అన్నారు. ఏడాదికి 220 మిలియన్ల ప్రయాణీకుల్ని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆదరించగల సత్తా కలిగి ఉందని ఆయన వివరించారు. డిపాచ్యూర్ బిల్డింగ్లో పబ్లిక్ హాల్, కమర్షియల్ ఏరియాస్ మరియు ఆఫీసులను విస్తరించడం, 64 చెక్ ఇన్ కౌంటర్స్ని ఏర్పాటు చేయడం, అదనంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేయడం వంటివి విస్తరణలో బాగం కానున్నాయి. 12 కొత్త బోర్డింగ్ లాంజెస్ను విస్తరణలో ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







