రైల్వే టైమ్ ఫ్రేమ్ని ఫిక్స్ చేయనున్న జిసిసి మినిస్టర్స్
- March 24, 2016
ఒమన్ సహా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్కి చెందిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ మల్టీ బిలియన్ డాలర్ విలువ చేసే రైల్వే ప్రాజెక్ట్ విషయమై చర్చించనున్నారు. జిసిసి దేశాలు సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ రైల్వే ప్రాజెక్ట్కి టైమ్ ఫ్రేమ్ సెట్ చేయడానికి ఈ సమావేశం జరుగుతుందని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఫుటైసి చెప్పారు యూఏఈకి చెందిన నేషనల్ రైల్వే కంపెనీ ఎతిహాద్ రైల్వే, సెకెండ్ స్టేజ్ ప్రాజెక్ట్ని రద్దు చేసిన దరిమిలా, దీనిపైనా చర్చలు జరగనున్నాయి ఈ సమావేశంలో. అయితే ఒమన్, అన్ని జిసిసి దేశాలతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉంది. 2,135 వేల కిలోమీటర్ల మేర రూపొందనున్న ఈ రైల్వే ప్రాజెక్ట్, తొమ్మిది సెగ్మెంట్లుగా విభజించబడింది. ఫస్ట్ సిగ్మెంట్లోని సోహార్ బురైమి సెగ్మెంట్లోగల 207 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఒమన్ తన ప్రాజెక్ట్ని పూర్తి చేసినా, ఇతర దేశాలు తమ పనిని పూర్తి చేయకపోవడంతో కనెక్టివిటీ కుదరదని మంత్రి చెప్పారు. జిసిసి దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైల్వే ప్రాజెక్ట్తో అన్ని దేశాల ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







