రైల్వే టైమ్ ఫ్రేమ్ని ఫిక్స్ చేయనున్న జిసిసి మినిస్టర్స్
- March 24, 2016
ఒమన్ సహా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్కి చెందిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ మల్టీ బిలియన్ డాలర్ విలువ చేసే రైల్వే ప్రాజెక్ట్ విషయమై చర్చించనున్నారు. జిసిసి దేశాలు సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ రైల్వే ప్రాజెక్ట్కి టైమ్ ఫ్రేమ్ సెట్ చేయడానికి ఈ సమావేశం జరుగుతుందని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఫుటైసి చెప్పారు యూఏఈకి చెందిన నేషనల్ రైల్వే కంపెనీ ఎతిహాద్ రైల్వే, సెకెండ్ స్టేజ్ ప్రాజెక్ట్ని రద్దు చేసిన దరిమిలా, దీనిపైనా చర్చలు జరగనున్నాయి ఈ సమావేశంలో. అయితే ఒమన్, అన్ని జిసిసి దేశాలతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉంది. 2,135 వేల కిలోమీటర్ల మేర రూపొందనున్న ఈ రైల్వే ప్రాజెక్ట్, తొమ్మిది సెగ్మెంట్లుగా విభజించబడింది. ఫస్ట్ సిగ్మెంట్లోని సోహార్ బురైమి సెగ్మెంట్లోగల 207 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఒమన్ తన ప్రాజెక్ట్ని పూర్తి చేసినా, ఇతర దేశాలు తమ పనిని పూర్తి చేయకపోవడంతో కనెక్టివిటీ కుదరదని మంత్రి చెప్పారు. జిసిసి దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైల్వే ప్రాజెక్ట్తో అన్ని దేశాల ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









