యూఏఈ ప్రభుత్వ సిబ్బందికి ‘గ్రీన్ పాస్ ప్రోటోకాల్’
- December 20, 2021
యూఏఈ: ప్రభుత్వ సిబ్బందికి గ్రీన్ పాస్ ప్రోటోకాల్ ను యూఏఈ తప్పనిసరి చేస్తు న్నట్లు ప్రకటించింది. జనవరి 3, 2022 నుండి ఈ ప్రోటోకాల్ అమల్లోకి రానుంది.దీని ప్రకారం.. కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు, బూస్టర్ షాట్(అర్హత ఉంటే) తీసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ విభాగాల్లోకి అనుమతి ఇయ్యనున్నారు.అలాగే వారు ప్రతి 14 రోజులకు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.నెగిటివ్ సర్టిఫికేట్ ను AlHosn యాప్లో గ్రీన్ స్టేటస్ను అప్డేట్ చేసుకోవాలి.ఈ నిబంధనలు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చే రెసిడెంట్స్ కు వర్తిస్తుంది.అదే సమయంలో వ్యాక్సిన్ పొందకుండా మెడికల్ ఫర్మిషన్ తీసుకున్నోళ్లు మాత్రం ప్రతి 7 రోజులకు పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ సర్టిఫికేట్ తో తమ గ్రీన్ స్టేటస్ ను అప్డేట్ చేసుకోవాల్సిందే. 16 ఏళ్లలోపు పిల్లలకు గ్రీన్ పాస్ ప్రోటోకాల్ నుండి మినహాయింపు ఇచ్చారు.గ్రీన్ ప్రోటోకాల్ నిబంధనలు పాటించిన వారి స్టేటస్ గ్రే కలర్ లోకి మారుతుంది.గ్రే కలర్ స్టేటస్ ఉన్న వ్యక్తులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతించరు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









