యూఏఈ ప్రభుత్వ సిబ్బందికి ‘గ్రీన్ పాస్ ప్రోటోకాల్’
- December 20, 2021
యూఏఈ: ప్రభుత్వ సిబ్బందికి గ్రీన్ పాస్ ప్రోటోకాల్ ను యూఏఈ తప్పనిసరి చేస్తు న్నట్లు ప్రకటించింది. జనవరి 3, 2022 నుండి ఈ ప్రోటోకాల్ అమల్లోకి రానుంది.దీని ప్రకారం.. కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు, బూస్టర్ షాట్(అర్హత ఉంటే) తీసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ విభాగాల్లోకి అనుమతి ఇయ్యనున్నారు.అలాగే వారు ప్రతి 14 రోజులకు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.నెగిటివ్ సర్టిఫికేట్ ను AlHosn యాప్లో గ్రీన్ స్టేటస్ను అప్డేట్ చేసుకోవాలి.ఈ నిబంధనలు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చే రెసిడెంట్స్ కు వర్తిస్తుంది.అదే సమయంలో వ్యాక్సిన్ పొందకుండా మెడికల్ ఫర్మిషన్ తీసుకున్నోళ్లు మాత్రం ప్రతి 7 రోజులకు పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ సర్టిఫికేట్ తో తమ గ్రీన్ స్టేటస్ ను అప్డేట్ చేసుకోవాల్సిందే. 16 ఏళ్లలోపు పిల్లలకు గ్రీన్ పాస్ ప్రోటోకాల్ నుండి మినహాయింపు ఇచ్చారు.గ్రీన్ ప్రోటోకాల్ నిబంధనలు పాటించిన వారి స్టేటస్ గ్రే కలర్ లోకి మారుతుంది.గ్రే కలర్ స్టేటస్ ఉన్న వ్యక్తులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతించరు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









