యూఏఈ ప్రభుత్వ సిబ్బందికి ‘గ్రీన్ పాస్ ప్రోటోకాల్‌’

- December 20, 2021 , by Maagulf
యూఏఈ ప్రభుత్వ సిబ్బందికి ‘గ్రీన్ పాస్ ప్రోటోకాల్‌’

యూఏఈ: ప్రభుత్వ సిబ్బందికి గ్రీన్ పాస్ ప్రోటోకాల్‌ ను యూఏఈ తప్పనిసరి చేస్తు న్నట్లు ప్రకటించింది. జనవరి 3, 2022 నుండి ఈ ప్రోటోకాల్ అమల్లోకి రానుంది.దీని ప్రకారం.. కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు, బూస్టర్ షాట్‌(అర్హత ఉంటే) తీసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ విభాగాల్లోకి అనుమతి ఇయ్యనున్నారు.అలాగే వారు ప్రతి 14 రోజులకు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.నెగిటివ్ సర్టిఫికేట్ ను AlHosn యాప్‌లో గ్రీన్ స్టేటస్‌ను అప్డేట్ చేసుకోవాలి.ఈ నిబంధనలు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చే రెసిడెంట్స్ కు వర్తిస్తుంది.అదే సమయంలో వ్యాక్సిన్ పొందకుండా మెడికల్ ఫర్మిషన్ తీసుకున్నోళ్లు మాత్రం ప్రతి 7 రోజులకు పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ సర్టిఫికేట్ తో తమ గ్రీన్ స్టేటస్ ను అప్డేట్ చేసుకోవాల్సిందే. 16 ఏళ్లలోపు పిల్లలకు గ్రీన్ పాస్ ప్రోటోకాల్ నుండి మినహాయింపు ఇచ్చారు.గ్రీన్ ప్రోటోకాల్ నిబంధనలు పాటించిన వారి స్టేటస్ గ్రే కలర్ లోకి మారుతుంది.గ్రే కలర్ స్టేటస్ ఉన్న వ్యక్తులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతించరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com