సందర్శకుల కోసం లిబరేషన్ టవర్ తెరిచే అవకాశం
- December 20, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సందర్శకుల కోసం లిబరేషన్ టవర్ని తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. లిబరేషన్ టవర్ని ఎగ్జిబిషన్ సెంటర్గా మార్చేందుకు సమాలోచనలు చేస్తోంది. పాత తరం టెలికమ్యూనికేషన్స్ పరికరాల్ని సందర్శకుల కోసం ప్రదర్శనకు వుంచుతారు. ఈ మేరకు ఓ కమిటీని కూడా అథారిటీస్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ళ క్రితం ఈ టవర్లోకి సందర్శకుల్ని నిలిపివేశారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి వున్నవారికి, విద్యార్థులకు, ఇతరులకు ఈ టవర్లోని హాల్ ఎంతో అద్భుతమైన అనుభూతినిస్తుంది. 372 మీటర్ల ఎత్తులోంచి చూసే అవకాశం కలుగుతుంది. లిబరేషన్ టవర్ అధికారికంగా 1996 మార్చి 10న ప్రారంభమైంది. అరబ్ ప్రాంతం మరియు గల్ఫ్లో ఇదే అతి ఎత్తయిన టవర్. ప్రపంచంలో నాలుగో అతి ఎత్తయిన టవర్ ఇది.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







