ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టిటిడి..
- December 23, 2021
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఎన్ని సార్లు దర్శించుకున్నా తనివి తీరదు భక్తులకు. ఏడుకొండలపై కొలువై ఉన్న ఆ వెంకన్న స్వామిని ఏటా కొన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తాజాగా భక్తుల సౌకర్యార్ధం టిటిడి దేవస్థాన అధికారులు 2022, జనవరి నెలకు సంబంధించి రోజుకు 20,000 చొప్పున 6.20 లక్షల టికెట్లు విడుదల చేస్తామని తెలిపింది.
ఈనెల డిసెంబరు 24 ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఇక డిసెంబర్ 31 నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో సర్వదర్శనం టికెట్లు ఇస్తామని తెలిపింది. జనవరి నెలకు సంబంధించి రోజుకు 5వేల చొప్పున మొత్తం 1.55 లక్షల సర్వదర్శనం టికెట్లు ఇస్తామని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.
దర్శనం కోసం భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ నుండి రూ. 300 టిక్కెట్ను కొనుగోలు చేయవచ్చు http://www.tirupatibalaji.ap.gov.in.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







