మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రముఖుల నివాళులు
- December 23, 2021
హైదరాబాద్: ఇవాళ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి. ఈ సందర్భంగా పీవీ నరసింహారావుకు ప్రముఖులు నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞానభూమి వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, అలాగే పీవీ సమాధి వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవీతో పాటు పీవీ కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. దేశంలో పీవీ ఎన్నో సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. పీవీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పీవీ నరసింహారావు దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి పీవీ నరసింహారావు అని, కానీ కేంద్రం తెలుగువారిని పట్టించుకోవడం లేదన్నారు. తెలుగువారంటే కేంద్రంలో గౌరవం లేదని మంత్రి తలసాని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







