ఒమిక్రాన్ వేగం..ఆ మాస్కులే బెటర్ అంటున్న నిపుణులు
- December 23, 2021
లండన్: దాదాపు రెండు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వాడకం అత్యవసరంగా మారింది. తర్వాత ఆ మాస్కులు కూడా ఫ్యాషన్ను ఒంట బట్టించుకున్నాయి.
రకరకాల రంగుల్లో, డిజైన్లతో విరివిగా లభిస్తూ.. ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. డెల్టాకంటే వేగంగా వ్యాపించే లక్షణం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో మాస్కుల వాడకంపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. రంగు రంగుల్లో, తిరిగి వినియోగించే మాస్కుల గురించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రిష్ గ్రీన్హాల్గ్ ఈ మాస్కుల వాడకం గురించి పలు విషయాలు వెల్లడించారు.
'ఆ మాస్కులు నిజంగా మంచివి కావొచ్చు లేక భయంకరమైన కావొచ్చు. రెండు మూడు పొరలతో ఉండే క్లాత్ మాస్కులు ప్రభావంతంగా పనిచేస్తాయి. కానీ, వాటి తయారీలో ఫ్యాషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వాటిని అలంకరణ వస్తువుగా చూస్తున్నారు. క్లాత్ మాస్కులతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. వాడే క్లాత్ విషయంలో ఎలాంటి వైద్య ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు. అదే ఎన్95 మాస్కుల తయారీదారులు మాత్రం .. తమ మాస్కులు 95 శాతం కణాలను వడపోస్తాయని నిర్ధారించుకోవాల్సి ఉంది. మాస్కులు పనితీరు ఎంత గొప్పగా ఉన్నా.. ముక్కు, నోటిని వాటితో సరిగా మూయకపోతే అంతా నిష్ర్పయోజనమే. అదే సమయంలో సరిగా శ్వాసతీసుకోవాల్సిన అవసరమూ ఉంది' అని ట్రిష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ వెలుగుచూడటంతో పలు దేశాలు, ప్రభుత్వాలు మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మాస్క్ లేకుండా పట్టుబడిన వారికి జరిమానాలు విధిస్తున్నాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..