లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ జనవరిలో అందుబాటులోకి

- December 23, 2021 , by Maagulf
లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ జనవరిలో అందుబాటులోకి

ఖతార్: లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ 2022 జనవరి 1న అందుబాటులోకి రానుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంవోటీ) ప్రకటించింది. ఆరు స్టేషన్లతో కూడిన ఆరెంజ్ లైన్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. మెరీనా, మెరీనా ప్రోమెండే, యాచట్ క్లబ్, ఎస్పలాండే మరియు ఎనర్జీ సిటీ సౌత్‌లతోపాటు దోహా మెట్రో స్టేషన్ మరియు ట్రామ్ కంబైన్డ్ స్టేషన్ లెగ్తాలియా స్టేషన్ కూడా ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. ప్రతి ఐదు నిమిషాలకు ట్రామ్ అందుబాటులో వుండేలా డిజైన్ చేశారు. ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం మెరుగైన రవాణా సౌకర్యాన్ని.. అందునా పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com