జిసిసి వలసదారులకు యూఏఈ ఇ-వీసా తప్పనిసరి
- March 25, 2016
జిసిసి వలసదారులు యూఏఈలోకి ప్రవేశించలంటే ఆన్లైన్ ఇ-వవీసా తప్పనిసరి. మార్చ్ 29 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రయాణీకులకు, ట్రావెల్ ఏజెంట్లకు యూఈఏ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టమైన సమాచారం పంపించారు. కొన్ని వర్గాలకు చెందిన జీసీసీ వలసదారులకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా నిబంధన ప్రకారం ఆన్లైన్లో ఈ-వీసాను ముందే పొందాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ స్పష్టం చేసింది. పలు ఎయిర్లైన్స్ సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. మస్కట్లోని ఎయిర్ అరేబియా అధికారులు మాత్రం ఈ విషయమై తమకు సమాచారం లేదన్నారు. తాజా నిబంధనల ప్రకారం యూఏఈ వీసా పొందే జిసిసి నివాసితుడికి ఎంట్రీ పర్మిట్ 30 రోజుల వరకు ఉంటుంది, ఎంట్రీ అయ్యాక 30 రోజులపాటు ఇది చెల్లుబాటు అవుతుంది. దీన్ని 60 రోజుల వరకు పెంచుకోవచ్చు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









