ముంబైలో నిబంధనలు మరింత కఠినం
- December 31, 2021
ముంబై: ముంబైలో కరోనా నిబంధనలను మరింత కఠినం చేశారు.రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకల పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ముంబై బీజ్లో అనుమతులను నిరాకరించారు.
సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్లో సందర్శకులను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.ఈ నిబంధనలు డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వ తేదీ వరకు అమలులో ఉంటాయని ప్రభుత్వం తెలియజేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, పోలీసులు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఒక్కరోజులో 198 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు రావడంతో అధికారులు దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!







