తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేదా లాక్డౌన్.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్
- January 04, 2022
తెలంగాణ: తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండటం థర్డ్ వేవ్కు సంకేతమని తెలిపారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గత రెండు వేవ్ల్లో నేర్చుకున్న పాఠాలతో మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలే కనిపించడం లేదని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు జరుగుతున్న ప్రచారంపై శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్లు విధించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాము గతంలోనే తేల్చి చెప్పామని, అయినప్పటికీ సోషల్మీడియాలో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జనవరి చివరి వారంలో లాక్డౌన్ ఉండొచ్చని తాను చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అలాంటి వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు. ఏ ప్రకటన అయిన ప్రభుత్వం మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో 15-18 వయసు గలవారు 22.78 లక్షల మంది ఉండగా, తొలి రోజున 24,240 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1014 సెంటర్లలో పిల్లలకు టీకాలు వేస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా 12 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో నేరుగా వచ్చిన వారికి టీకాలు వేశామన్నారు. వచ్చే గురువారం లేదా శుక్రవారం నుంచి కార్పొరేషన్లలోనూ అడ్వాన్స్ బుకింగ్ సిస్టమ్తో పాటు, నేరుగా వచ్చిన వారికీ టీకా ఇచ్చేలా వ్యాక్సినేషన్ ప్రణాళికలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









