12 దేశాల ప్రయాణీకులకు కొత్త కండిషన్స్ పెట్టిన యూఏఈ
- January 05, 2022
యూఏఈ: కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై యూఏఈ కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 12 దేశాల నుండి దుబాయ్కి ప్రయాణించే ప్రయాణీకులు 48 గంటల చెల్లుబాటుతో నెగెటివ్ కోవిడ్-19 PCR సర్టిఫికేట్ ని సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 2, 2022 నుండి UK నుండి దుబాయ్కి ప్రయాణించే ప్రయాణీకులందరూ తప్పనిసరిగా బయలుదేరడానికి 48 గంటల ముందు తీసుకున్న నెగటివ్ కోవిడ్-19 PCR పరీక్ష ప్రమాణపత్రాన్ని కలిగి ఉండాలన్న నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. ఎమిరేట్స్ ఎయిర్లైన్ తన వెబ్సైట్లోని తాజా అప్డేట్లో ఈ మేరకు మార్పులు చేసింది. ఇకపై RT PCR పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఎక్కడ తీసుకున్నారో కూడా పేర్కొనాల్సి ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ నుండి ప్రయాణానికి NHS కోవిడ్-19 పరీక్ష సర్టిఫికెట్లు ఆమోదించబడవని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









