జీసస్‌ ఫర్‌ రన్‌ కవిత ప్రారంభించారు..

- March 25, 2016 , by Maagulf
జీసస్‌ ఫర్‌ రన్‌ కవిత ప్రారంభించారు..

మంచి కోసం పరితపించే జీసస్‌... ఆశయాలు ఎందరికో స్పూర్తినిస్తాయని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. చెడు తర్వాత తప్పకుండా మంచి జరుగుతుందనడానికి ఈస్టర్‌ పర్వదినమే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. జీసస్‌ ఫర్‌ రన్‌ పేరుతో నిర్వహించిన పరుగును ఎల్బీస్టేడియంలో కవిత ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు పరుగు సాగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రైస్తవులతో పాటు ఎంపీ ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. ప్రపంచంలో ఉగ్రదాడులు తీవ్రమవుతున్న తరుణంలో శాంతి సందేశాలు చేకూరాలని, ప్రజల్లో మనోస్థైర్యం నింపేందుకు చేపట్టిన జీసస్‌ఫర్‌ రన్‌ ఎంతో శుభపరిణామమని ఆమె తెలిపారు.కొత్త రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలని అంతా ప్రార్థన చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com