నెదర్లాండ్స్ అగ్నిప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి!
- January 07, 2022
హెగ్: నెదర్లాండ్స్ రాజధాని హెగ్లోని ఓ భవంతిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఆసిఫ్ నగర్కి చెందిన అబ్దుల్ హదీ (43) గత కొన్నేళ్లుగా నెదర్లాండ్స్లోని హెగ్లో నివశిస్తున్నాడు. అతనికి నెదర్లాండ్కి సంబంధించిన పర్మినెంట్ వీసా కూడా ఉంది. కాగా జనవరి 5న అతను నివశిస్తున్న ష్విల్డెర్షిజ్ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ.. 24 గంటల అనంతరం మృతి చెందాడు.
కాగా, అబ్దుల్ హాదీ గత సంవత్సరం 2021 జనవరిలో భారత్కి వచ్చి... మార్చి నెలలో నెదర్లాండ్స్కి తిరిగి వెళ్లాడు. మళ్లీ త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానన్న కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్కి తరలించాలంటూ.. భారత విదేశాంగ శాఖామంత్రి, నెదర్లాండ్స్ ఇండియన్ ఎంబసీ అధికారులకి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







