నెదర్లాండ్స్ అగ్నిప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి!
- January 07, 2022
హెగ్: నెదర్లాండ్స్ రాజధాని హెగ్లోని ఓ భవంతిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఆసిఫ్ నగర్కి చెందిన అబ్దుల్ హదీ (43) గత కొన్నేళ్లుగా నెదర్లాండ్స్లోని హెగ్లో నివశిస్తున్నాడు. అతనికి నెదర్లాండ్కి సంబంధించిన పర్మినెంట్ వీసా కూడా ఉంది. కాగా జనవరి 5న అతను నివశిస్తున్న ష్విల్డెర్షిజ్ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ.. 24 గంటల అనంతరం మృతి చెందాడు.
కాగా, అబ్దుల్ హాదీ గత సంవత్సరం 2021 జనవరిలో భారత్కి వచ్చి... మార్చి నెలలో నెదర్లాండ్స్కి తిరిగి వెళ్లాడు. మళ్లీ త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానన్న కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్కి తరలించాలంటూ.. భారత విదేశాంగ శాఖామంత్రి, నెదర్లాండ్స్ ఇండియన్ ఎంబసీ అధికారులకి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







