నేనేమీ డిమాండ్లు చేయలేదు:ఆర్జీవీ
- January 10, 2022
అమరావతి: ఏపీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. పరిశ్రమలో నెలకొన్న తాజా సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే.. తాను ఏమీ డిమాండ్లు చేయలేదని.. పరిశ్రమలో ఉన్న ప్రస్తుత సమస్యలపై అభిప్రాయాలు మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు.తాను డిస్ట్రిబ్యూటర్ల తరఫునో..నిర్మాతల తరఫునో మంత్రిని కలవలేదని తేల్చి చెప్పారు.
“టికెట్ రేట్ల పెంపుతో పాటు.. సినిమా పరిశ్రమలోని మరికొన్ని సమస్యలపై మంత్రి పేర్ని నానితో మాట్లాడాను. నేనేమీ డిమాండ్లు చేయలేదు. కానీ.. సమస్యల పరిష్కారంపై నా అభిప్రాయాలు చెప్పాను. ఆ దిశగా తర్వాత చర్యలు జరగాల్సి ఉంది. నా సూచనలను మంత్రి విన్నారు. ఈ సమావేశంపై నేను సాటిస్ఫై అయ్యాను” అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
ప్రభుత్వం తన అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పిన వర్మ..సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తప్పక చేపడుతుందన్నారు.పరిశ్రమలో పవన్ కల్యాణ్ నో, బాలకృష్ణనో టార్గెట్ గా చేసుకుని.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తాను భావించడం లేదని వర్మ చెప్పారు.అందరి సంక్షేమం దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఒక్క సమావేశంతోనే అంతా అయిపోదని..ప్రతి సమస్యకు పరిష్కారం రాదని వర్మ అన్నారు.ఇది సిరీస్ ఆఫ్ డిస్కషన్ గా చెప్పారు.మరోసారి మంత్రి నానితో తన సమావేశం ఉంటుందనే అభిప్రాయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!
- భద్రతా దళాల అప్రమత్తతను ప్రశంసించిన సౌదీ మినిస్టర్..!!
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!









