నేనేమీ డిమాండ్లు చేయలేదు:ఆర్జీవీ
- January 10, 2022
అమరావతి: ఏపీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. పరిశ్రమలో నెలకొన్న తాజా సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే.. తాను ఏమీ డిమాండ్లు చేయలేదని.. పరిశ్రమలో ఉన్న ప్రస్తుత సమస్యలపై అభిప్రాయాలు మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు.తాను డిస్ట్రిబ్యూటర్ల తరఫునో..నిర్మాతల తరఫునో మంత్రిని కలవలేదని తేల్చి చెప్పారు.
“టికెట్ రేట్ల పెంపుతో పాటు.. సినిమా పరిశ్రమలోని మరికొన్ని సమస్యలపై మంత్రి పేర్ని నానితో మాట్లాడాను. నేనేమీ డిమాండ్లు చేయలేదు. కానీ.. సమస్యల పరిష్కారంపై నా అభిప్రాయాలు చెప్పాను. ఆ దిశగా తర్వాత చర్యలు జరగాల్సి ఉంది. నా సూచనలను మంత్రి విన్నారు. ఈ సమావేశంపై నేను సాటిస్ఫై అయ్యాను” అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
ప్రభుత్వం తన అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పిన వర్మ..సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తప్పక చేపడుతుందన్నారు.పరిశ్రమలో పవన్ కల్యాణ్ నో, బాలకృష్ణనో టార్గెట్ గా చేసుకుని.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తాను భావించడం లేదని వర్మ చెప్పారు.అందరి సంక్షేమం దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఒక్క సమావేశంతోనే అంతా అయిపోదని..ప్రతి సమస్యకు పరిష్కారం రాదని వర్మ అన్నారు.ఇది సిరీస్ ఆఫ్ డిస్కషన్ గా చెప్పారు.మరోసారి మంత్రి నానితో తన సమావేశం ఉంటుందనే అభిప్రాయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







