కరోనాపై ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి: పవన్ కళ్యాణ్
- January 10, 2022
హైదరాబాద్: భారత దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఒక్కరోజులోనే లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయని.. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ తిరుగుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోవాలని, బయటికెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
కరోనా సెకండ్వేవ్లో మందులు, ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని… ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ కోరారు. ఆయా ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోనివారు ఉంటే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని.. విందులు, వినోదాలు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గమని పవన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..