రోజురోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య : ఇరాక్
- March 26, 2016ఇరాక్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని సాకర్ మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఇరాక్లోని అల్అసద్ మిలిటరీ స్థావరంపై శనివారం ఐఎస్ ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారు. మిలిటరీ స్థావరంలో వందమందిపైగా సంకీర్ణ సలహాదారులు సమావేశమైన సమయంలో దాడులు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నలుగురు ఐఎస్ ఆత్మాహుతి సభ్యులు దాడులకు ప్రయత్నించారని, తమను తాము పేల్చుకోవడంతో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారని అల్జజీరా ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ అలీ ఇబ్రహిం డబౌన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్