త్వరలో ‘మోహన్బాబు యూనివర్సిటీ’
- January 13, 2022
హైదరాబాద్: హీరోగా, విలన్ గా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు పరిశ్రమలో ఉంటూ ఎన్నో మంచి సినిమాలని అందించిన సీనియర్ నటుడు మోహన్ బాబు కేవలం సినీ పరిశ్రమలోనే కాక విద్యారంగంలో కూడా రాణిస్తున్నారు. 1993లో తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ను అనే విద్యాసంస్థని స్థాపించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యావంతుల్ని ఆయన విద్యాసంస్థల నుంచి తీర్చిదిద్దుతున్నారు.
తాజాగా మరో కీలక విషయం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోహన్ బాబు. త్వరలో “మోహన్ బాబు యూనివర్సిటీ”ని ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ”శ్రీ విద్యానికేతన్లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







