యూఏఈ పై జరిగిన ఉగ్రదాడికి ఘాటైన సమాధానమిచ్చిన సౌదీ
- January 18, 2022
యూఏఈ: అబుధాబి పై జరిగిన ఉగ్రదాడి కి సమాధానంగా గడిచిన 24 గంటల్లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం సోమవారం యెమెన్ లోని హౌతీ ఉగ్రవాదులపై ప్రతిదాడి చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది సైనిక వాహనాలు ధ్వంసమవ్వగా 80కి పైగా స్థావరాలు అంతమొందాయని అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ట్విట్టర్లో తెలిపింది.
"మేము గత 24 గంటల్లో మారిబ్లో మిలీషియా లక్ష్యంగా 17 దాడులు నిర్వహించాము" అని ట్వీట్లో పేర్కొంది.
ఇరాన్ మద్దతుతో యెమెన్ లోని హౌతీ మిలిటంట్లు యూఏఈ రాజధాని అబుధాబి లో డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, ఆరుగురు గాయపడిన నేపథ్యంలో తాజా దాడులు జరిగాయి.
ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది యూఏఈ. "పిరికి" ఉగ్రవాద చర్యగా పేర్కొన్న ఈ చర్యకు "ప్రతిస్పందించే హక్కు" ఉందని నొక్కి చెప్పింది.
సనాలో వైమానిక దళం 24 గంటల వైమానిక కార్యకలాపాలను నిర్వహిస్తోందని మరియు ప్రజలు వారి భద్రత దృష్ట్యా హౌతీ మిలీషియా శిబిరాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది అరబ్ సంకీర్ణం.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







