యూఏఈ పై జరిగిన ఉగ్రదాడికి ఘాటైన సమాధానమిచ్చిన సౌదీ
- January 18, 2022
యూఏఈ: అబుధాబి పై జరిగిన ఉగ్రదాడి కి సమాధానంగా గడిచిన 24 గంటల్లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం సోమవారం యెమెన్ లోని హౌతీ ఉగ్రవాదులపై ప్రతిదాడి చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది సైనిక వాహనాలు ధ్వంసమవ్వగా 80కి పైగా స్థావరాలు అంతమొందాయని అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ట్విట్టర్లో తెలిపింది.
"మేము గత 24 గంటల్లో మారిబ్లో మిలీషియా లక్ష్యంగా 17 దాడులు నిర్వహించాము" అని ట్వీట్లో పేర్కొంది.
ఇరాన్ మద్దతుతో యెమెన్ లోని హౌతీ మిలిటంట్లు యూఏఈ రాజధాని అబుధాబి లో డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, ఆరుగురు గాయపడిన నేపథ్యంలో తాజా దాడులు జరిగాయి.
ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది యూఏఈ. "పిరికి" ఉగ్రవాద చర్యగా పేర్కొన్న ఈ చర్యకు "ప్రతిస్పందించే హక్కు" ఉందని నొక్కి చెప్పింది.
సనాలో వైమానిక దళం 24 గంటల వైమానిక కార్యకలాపాలను నిర్వహిస్తోందని మరియు ప్రజలు వారి భద్రత దృష్ట్యా హౌతీ మిలీషియా శిబిరాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది అరబ్ సంకీర్ణం.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









