వాహనాలు, భారీ శబ్దాలు: వేలాది మందికి జరిమానా

- January 20, 2022 , by Maagulf
వాహనాలు, భారీ శబ్దాలు: వేలాది మందికి జరిమానా

అబుధాబి: అబుధాబి పోలీస్ విభాగం ఓ వీడియోను విడుదల చేసింది. వాహనాలకు చట్ట వ్యతిరేకంగా మార్పులు చేసి, విపరీతమైన శబ్దాలతో అవి నడిచేలా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ వీడియో ద్వారా అబుధాబి పోలీస్, వాహనదారుల్ని హెచ్చరించడం జరిగింది. 2021లో 2,750 మంది వాహనదారులకు ఈ విషయమై జరిమానాలు విధించినట్లు అబుధాబి పోలీస్ పేర్కొంది. మితిమీరిన శబ్దంతో కూడిన వాహనాలను నడిపేవారికి 2,000 దిర్హాముల జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ఇంజిన్ లేదా ఛాసిస్ మార్పులు (అనధికారికంగా) చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. వాహనాన్ని 30 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాన్ని విడిపించుకునేందుకు 10,000 దిర్హాములు చెల్లించాలి, అది కూడా మూడు నెలల్లోనే జరగాలి. లేనిపక్షంలో వాహనాన్ని వేలంలో విక్రయించేస్తారు. అనవసర శబ్దాలు చేసే వాహనాల వల్ల ఇతర వాహనాల డ్రైవర్లకు, ప్రజలకు ఇబ్బందికరంగా వుంటుంది. పిల్లలు, బాగా పెద్దవారు భయాందోళనకు గురవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com