‘మేజర్’ సినిమా రిలీజ్ వాయిదా..
- January 24, 2022
హైదరాబాద్: అడివి శేష్ హీరోగా, ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వంలో, సూపర్స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న మూవీ ‘మేజర్’. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికలు.
26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 11న రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
కరోనా కారణంగా, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆంక్షల నేపథ్యంలో ‘మేజర్’ సినిమాని వాయిదా వేసినట్టు తెలిపారు.ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాడు శేష్. తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ‘మేజర్’ లో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







