ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ప్రయాణీకుల రుసుము: ఖతార్ ఎయిర్పోర్ట్స్
- January 26, 2022
దోహా: ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల సర్క్యులర్ (2)ని విడుదల చేసింది. ఎయిర్ పోర్టుల్లో కొత్త సర్వీసు రుసుము ప్రవేశ పెట్టడానికి సంబంధించిన అమెండ్మెంట్ ఇది. ఈ మేరకు అందరు ఎయిర్ లైన్ మేనేజర్లకు, ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ప్రయాణీకుల రుసుముని రివ్యూ చేసి, కొత్తగా ప్రయాణీకుల రుసుముని తెరపైకి తెచ్చింది. ఎయిర్ ఫ్రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుసుము అలాగే సెక్యూరిటీ రుసుముని అదనంగా కలిపారు. ఒక వ్యక్తికి 24 గంటల వరకు60 క్యుఎఆర్ వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని ఎయిర్ పోర్ట్ అభివృద్ధి రుసుముగా పేర్కొన్నారు. ప్రయాణీకుల భద్రతకు సంబంధించి 10 క్యుఎఆర్ వసూలు చేస్తారు. రెండేళ్ళ లోపు చిన్నారులకు ఈ ఫీజు నుంచి వెసులుబాటు వుంటుంది. ఇన్ కమింగ్ అలాగే ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్ల కోసం 10 క్యుఎఆర్ (మెట్రిక్ టన్నుకి) వసూలు చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







