ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ప్రయాణీకుల రుసుము: ఖతార్ ఎయిర్పోర్ట్స్
- January 26, 2022
దోహా: ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల సర్క్యులర్ (2)ని విడుదల చేసింది. ఎయిర్ పోర్టుల్లో కొత్త సర్వీసు రుసుము ప్రవేశ పెట్టడానికి సంబంధించిన అమెండ్మెంట్ ఇది. ఈ మేరకు అందరు ఎయిర్ లైన్ మేనేజర్లకు, ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ప్రయాణీకుల రుసుముని రివ్యూ చేసి, కొత్తగా ప్రయాణీకుల రుసుముని తెరపైకి తెచ్చింది. ఎయిర్ ఫ్రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుసుము అలాగే సెక్యూరిటీ రుసుముని అదనంగా కలిపారు. ఒక వ్యక్తికి 24 గంటల వరకు60 క్యుఎఆర్ వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని ఎయిర్ పోర్ట్ అభివృద్ధి రుసుముగా పేర్కొన్నారు. ప్రయాణీకుల భద్రతకు సంబంధించి 10 క్యుఎఆర్ వసూలు చేస్తారు. రెండేళ్ళ లోపు చిన్నారులకు ఈ ఫీజు నుంచి వెసులుబాటు వుంటుంది. ఇన్ కమింగ్ అలాగే ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్ల కోసం 10 క్యుఎఆర్ (మెట్రిక్ టన్నుకి) వసూలు చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









