భారత గణతంత్ర దినోత్సవం: యూఏఈ భారతీయ వలసదారులకు భద్రమైన దేశం

- January 26, 2022 , by Maagulf
భారత గణతంత్ర దినోత్సవం: యూఏఈ భారతీయ వలసదారులకు భద్రమైన దేశం

యూఏఈ: భారత 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ, యూఏఈ భారతీయ వలసదారులకు అత్యంత భద్రమైన దేశమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు రిపబ్లిక్ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారనీ, యూఏఈ వ్యాప్తంగా కూడా భారతీయులు సంబరాల్లో మునిగిపోయారని అన్నారాయన. యూఏఈ - భారతదేశం మధ్య సన్నిహిత సంబంధాలు రోజురోజుకీ మరింత బలపడుతున్నాయనీ, ప్రవాస భారతీయులకు యూఏఈ అత్యంత భద్రతతో కూడిన దేశమని చెప్పారాయన. పెట్టుబడుల విషయంలోనూ, పరస్పర సహకారం విషయంలో యూఏఈ, భారతదేశం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు.కోవిడ్ పాండమిక్ సమయంలో సహాయ సహకారాలు అందించిన భారత దేశానికి చెందిన కమ్యూనిటీ సభ్యులను భారత రాయబారి సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com