దుబాయ్ చేరుకున్న కేరళ సీఎం పినరయి విజయన్
- January 30, 2022
దుబాయ్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దుబాయ్ చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో ట్రీట్ మెంట్ పొందిన అనంతరం కేరళకు తిరిగి రావాల్సి ఉంది. అయితే, ఎక్స్ పో 2020 దుబాయ్లో పినరయి 'కేరళ వీక్'ను ప్రారంభించేందుకు దుబాయ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా పెవిలియన్లో కేరళ వీక్ ను ఆయన ప్రారంభించి ఫిబ్రవరి 7న కేరళకు పినరయి తిరిగి వెళ్లనున్నట్లు సమాచారం. మార్చి 2020లో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత విజయన్ యూఏఈకి రావడం ఇదే తొలిసారి. వరల్డ్ ఫెయిర్లో భాగంగా ఇండియా పెవిలియన్ ప్రస్తుతం హెల్త్ అండ్ వెల్నెస్ థీమ్ వీక్ కోసం ఈవెంట్లను నిర్వహిస్తోంది. శుక్రవారం పెవిలియన్లో వైద్య పరికరాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలపై ప్యానెల్ చర్చ జరిగింది. వర్చువల్ ఈవెంట్లో పలువురు ప్రభుత్వ, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి ఎస్ అపర్ణ మాట్లాడుతూ.. వైద్య పరికరాల రంగం వృద్ధి పథంలో పయనిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలను తీర్చే సామర్థ్యం స్థానిక పరిశ్రమలకు ఉందన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







