కువైట్ లో ఇంటర్నెట్ సర్వీసెస్ రీస్టోర్డ్
- January 30, 2022
కువైట్: ఇంటర్నెట్ సర్వీసులను కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటరీ అథారిటీ (సిట్రా) తిరిగి ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఫాల్కన్ జలాంతర్గామి కారణంగా సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఇంటర్నెట్ అంతరాయంతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సభ్య దేశాల మధ్య కమ్యూనికేషన్లు ప్రభావితం కాలేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో ఇతర అంతర్జాతీయ మార్గాలు, కేబుల్స్ ను ఉపయోగించడం ద్వారా తక్కువ వ్యవధిలో సమస్యను పరిష్కరించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఒమన్ సుల్తానేట్లోని మస్కట్ నగరానికి 183 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ వైపు వెళుతున్న కేబుల్ ఫాల్కన్ జలాంతర్గామి కారణంగా కట్ అయిందని, మరొకటి సైనిక కార్యకలాపాల కారణంగా మస్కట్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు వెళుతున్న కేబుల్ కట్ అయిందని నిర్వాహణదారు జీసీఎక్స్ కంపెనీ చెప్పిందని సిట్రా పేర్కొంది. మార్చి 2021 నుండి కొత్త అంతర్జాతీయ ల్యాండ్, సీ కేబుల్లను ఇన్స్టాల్ చేయడానికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు సిట్రా వెల్లడించింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







