కువైట్ లో ఇంటర్నెట్ సర్వీసెస్ రీస్టోర్డ్
- January 30, 2022
కువైట్: ఇంటర్నెట్ సర్వీసులను కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటరీ అథారిటీ (సిట్రా) తిరిగి ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఫాల్కన్ జలాంతర్గామి కారణంగా సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఇంటర్నెట్ అంతరాయంతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సభ్య దేశాల మధ్య కమ్యూనికేషన్లు ప్రభావితం కాలేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో ఇతర అంతర్జాతీయ మార్గాలు, కేబుల్స్ ను ఉపయోగించడం ద్వారా తక్కువ వ్యవధిలో సమస్యను పరిష్కరించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఒమన్ సుల్తానేట్లోని మస్కట్ నగరానికి 183 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ వైపు వెళుతున్న కేబుల్ ఫాల్కన్ జలాంతర్గామి కారణంగా కట్ అయిందని, మరొకటి సైనిక కార్యకలాపాల కారణంగా మస్కట్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు వెళుతున్న కేబుల్ కట్ అయిందని నిర్వాహణదారు జీసీఎక్స్ కంపెనీ చెప్పిందని సిట్రా పేర్కొంది. మార్చి 2021 నుండి కొత్త అంతర్జాతీయ ల్యాండ్, సీ కేబుల్లను ఇన్స్టాల్ చేయడానికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు సిట్రా వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







