కాజల్ కు యూఏఈ గోల్డెన్ వీసా
- February 05, 2022
దుబాయ్: మన ఇండియన్స్ ఎక్కువగా వెళ్లే దేశాల్లో దుబాయ్ ఒకటి.దుబాయ్ కి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి, సెలబ్రిటీలకు, దుబాయ్ లో పెట్టుబడులు పెట్టే వాళ్లకి అక్కడి ప్రభుత్వం స్పెషల్ వీసాలు జారీ చేస్తారు.ఈ స్పెషల్ వీసాలు కూడా అతి తక్కువ మందికి జారీ చేస్తారు.ఈ స్పెషల్ వీసాని ‘గోల్డెన్ వీసా’ అంటారు.
ఈ గోల్డెన్ వీసా ఉంటే దుబాయ్ కి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వెళ్లొచ్చు, రావొచ్చు ఎలాంటి వీసా ప్రాసెస్ లేకుండా.మన ఇండియాకి సంబంధించి చాలా తక్కువ మందికి ఈ ‘గోల్డెన్ వీసా’ని దుబాయ్ ప్రభుత్వం ఇచ్చింది.కొంత మంది బాలీవుడ్, కోలీవుడ్, మలయాళ సినీ ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసా లభించింది. సౌత్ సినిమా స్టార్స్ లో మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్ లాంటి స్టార్స్ కి మాత్రమే ఈ గోల్డెన్ వీసా లభించింది.
తాజాగా ఈ గోల్డెన్ వీసా కాజల్ అగర్వాల్ ని వరించింది. కాజల్ పెళ్లి చేసుకొని సినిమాలు చేస్తూ బిజినెస్ చూసుకుంటుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకి దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ తాజాగా ఈ గోల్డెన్ వీసాని దుబాయ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది.నాకు ఈ గుర్తింపు ఇచ్చిన యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్లో కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కాజల్ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







