కాజల్ కు యూఏఈ గోల్డెన్ వీసా
- February 05, 2022
దుబాయ్: మన ఇండియన్స్ ఎక్కువగా వెళ్లే దేశాల్లో దుబాయ్ ఒకటి.దుబాయ్ కి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి, సెలబ్రిటీలకు, దుబాయ్ లో పెట్టుబడులు పెట్టే వాళ్లకి అక్కడి ప్రభుత్వం స్పెషల్ వీసాలు జారీ చేస్తారు.ఈ స్పెషల్ వీసాలు కూడా అతి తక్కువ మందికి జారీ చేస్తారు.ఈ స్పెషల్ వీసాని ‘గోల్డెన్ వీసా’ అంటారు.
ఈ గోల్డెన్ వీసా ఉంటే దుబాయ్ కి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వెళ్లొచ్చు, రావొచ్చు ఎలాంటి వీసా ప్రాసెస్ లేకుండా.మన ఇండియాకి సంబంధించి చాలా తక్కువ మందికి ఈ ‘గోల్డెన్ వీసా’ని దుబాయ్ ప్రభుత్వం ఇచ్చింది.కొంత మంది బాలీవుడ్, కోలీవుడ్, మలయాళ సినీ ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసా లభించింది. సౌత్ సినిమా స్టార్స్ లో మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్ లాంటి స్టార్స్ కి మాత్రమే ఈ గోల్డెన్ వీసా లభించింది.
తాజాగా ఈ గోల్డెన్ వీసా కాజల్ అగర్వాల్ ని వరించింది. కాజల్ పెళ్లి చేసుకొని సినిమాలు చేస్తూ బిజినెస్ చూసుకుంటుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకి దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ తాజాగా ఈ గోల్డెన్ వీసాని దుబాయ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది.నాకు ఈ గుర్తింపు ఇచ్చిన యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్లో కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కాజల్ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







