యూఏఈలో జూలై 1 నుండి ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు

- February 08, 2022 , by Maagulf
యూఏఈలో జూలై 1 నుండి ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు

యూఏఈ: ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగంపై ఛార్జీ విధించాలని, రెండేళ్లలో పూర్తిగా నిషేధం విధించాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ సమస్యలపై రెండేళ్లలో పూర్తిగా నిషేధించే లక్ష్యంతో ప్లాస్టిక్ బ్యాగులపై ఫీ వసూలు చేయనున్నట్లు దుబాయ్ ప్రకటించింది. జూలై 1 నుండి 25-ఫిల్స్ (6 శాతం) ఫీ వసూలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఒంటెలు, తాబేళ్లు చనిపోతున్నాయని, పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో పునర్వినియోగ సంచులను తీసుకురావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com