సీఎం జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం
- February 10, 2022
అమరావతి: టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి ఉన్నారు. నాగార్జున ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.
సినీ ప్రముఖులను తాడేపల్లి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జీవో నంబరు 35లో సవరణలపై చర్చించనున్నారు. అలాగే, థియేటర్ల వర్గీకరణ, వాటిల్లో స్నాక్స్ అమ్మకాల ధరలు వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం సీఎంవో నుంచే ఓ ప్రకటన వస్తుందని చిరంజీవి మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









