ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధాని
- February 12, 2022
సౌదీ: క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధానిలు పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉప ప్రధాని, రక్షణ మంత్రి క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురు సమీక్షించారు. ఉమ్మడిగా ఆసక్తి ఉన్న పలు అంశాలపై క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధాని చర్చించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరం పెడుతున్న కరోనా మహమ్మారిపై కూడా వారు చర్చించారు. ఈ సందర్భంగా సౌదీ చేపట్టిన కొవిడ్ నియంత్రణ చర్యలను బ్రిటన్ ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ వాణిజ్యంపై కరోనా ప్రభావంపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రయాలను పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధానిలు చర్చించారు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







