సౌదీలో ఫస్ట్ డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఏర్పాటు

- February 13, 2022 , by Maagulf
సౌదీలో ఫస్ట్ డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఏర్పాటు

సౌదీ: వాడి అల్-దవాసిర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టును పూర్తి డిజిటల్ కోర్టుగా మార్చినట్లు సౌదీ అరేబియా గ్రీవెన్స్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ చైర్మన్, అడ్మినిస్ట్రేటివ్ జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్-యూసెఫ్ వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి డిజిటల్ కోర్టు పని ప్రారంభిస్తుందన్నారు. వాడి అల్ దవాసిర్ డిజిటల్ కోర్టు రాజ్యంలో మొదటిదని, దాంతో సౌదీ అరేబియాలో మొదటి డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టుగా దీనికి గుర్తింపు లభించిందన్నారు. ఈ సమీకృత డిజిటల్ కోర్టు ద్వారా న్యాయపరమైన సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు గ్రీవెన్స్ బోర్డు కృషి చేస్తోందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com