లూలు గ్రూప్ చైర్మన్ కు బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ వీసా
- February 14, 2022
బహ్రెయిన్: లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ MA బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ వీసాను పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. గోల్డెన్ రెసిడెన్సీ వీసా ప్రతిభావంతులను ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి బహ్రెయిన్ అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూసఫ్ అలీ స్పందిస్తూ.. ఈ గౌరవాన్ని అందుకోవడం తన జీవితంలో చాలా గర్వంగా ఉందన్నారు. కింగ్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, బహ్రెయిన్ ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫా, బహ్రెయిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ ఆర్థిక వృద్ధి పట్ల తన నిబద్ధతను బలోపేతం చేయాలని కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలు యూసఫ్ అలీకి పిలుపునిచ్చారు. ఈ గోల్డెన్ రెసిడెన్సీ వీసాతో ఈ ప్రాంతంలోని కీలక పెట్టుబడులు, వ్యాపార కేంద్రాలలో ఒకటిగా బహ్రెయిన్ ఇమేజ్ను మరింత పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు. 2014లో హెచ్ఎం కింగ్ హమద్ నుండి బహ్రెయిన్ అత్యున్నత గౌరవం 'వెస్సామ్ అల్ బహ్రెయిన్' అందుకున్న మొదటి బహ్రెయిన్యేతర వ్యక్తి కూడా యూసఫాలీయే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







