ఇండియా, పాకిస్తాన్‌లకు 760 దిర్హాముల ఫేర్‌ ప్రకటించిన ఎయిర్ అరేబియా

- February 14, 2022 , by Maagulf
ఇండియా, పాకిస్తాన్‌లకు 760 దిర్హాముల ఫేర్‌ ప్రకటించిన  ఎయిర్ అరేబియా

యూఏఈ: షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా, ప్రత్యేక విమాన ఛార్జీలను భారత ఉప ఖండంలోని 12కి పైగా నగరాలకు ప్రకటించడం జరిగింది.760 దిర్హాముల నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. ఎకానమీ క్లాస్ తిరుగు ప్రయాణం కోసం ఈ ధరల్ని ప్రకటించారు. ప్రయాణీకులు ఫిబ్రవరి 20 ఆదివారం లోపు బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.కోచి నుంచి 760 దిర్హాములు, ఢిల్లీ మరియు ముంబైలకు 1,050, అహ్మదాబాద్  1050, బెంగళూరుకి 1150 దిర్హాముల ఫేర్ నిర్ణయించారు.కరాచీ, సియోల్‌కోట్, ఫైసలాబాద్ ప్రయాణీకులు 849, 949, 1040 దిర్హాములు చెల్లించాలి.షార్జా మరియు రస్ అల్ ఖైమా నగరాలకు విమానాలు నడుపుతున్నారు. కాగా, ఈజిప్టు నగరాలైన అలెగ్జాండ్రియా, కైరో నగరాలకు 900 అలాగే 1050 దిర్హాములతో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com