నిర్మాణ రంగ కార్మికుల భద్రత కోసం కొత్త చట్టాలు
- February 18, 2022
యూఏఈ: నిర్మాణ రంగ కార్మికుల భద్రత నిమిత్తం కొత్త డిక్రీని విడుదల చేశారు. 50 మంది కంటే ఎక్కువ కార్మికులున్న ఎస్టాబ్లిష్మెంట్స్ (కార్మికుల కనీస వేతనం 1,500 దిర్హాములు) వుంటే, ఖచ్చితంగా కార్మికులకు అకామడేషన్ కల్పించాలి. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎండ ప్రాంతంలో పనిచేసేందుకు నిర్మాన రంగ అలాగే ఇండస్ట్రియల్ కార్మికులను వినియోగించకూడదు. 100 మంది కంటే ఎక్కువమంది కార్మికులు పనిచేసే సంస్థలు తప్పనిసరిగా హెల్త్ మరియు సేఫ్టీ అధికారిని నియమించుకోవాలి. నిర్మాణ రంగ ప్రాంతాల్లో భద్రతని సదరు అధికారి పర్యవేక్షిస్తుండాలి. కార్మికుల భద్రతకు సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి యజమాని పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సి వుంటుంది. కార్మికులు పూర్తి భద్రత నడుమ పని చేయాలి, వారికి ఎంప్లాయర్ పూర్తి వివరాలు తెలియజేయాలి. పని ప్రాంతంలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించే కార్మికులకు పెనాల్టీ విధించే అధికారాన్ని యజమానికి కట్టబెట్టింది ఈ డిక్రీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







