నిర్మాణ రంగ కార్మికుల భద్రత కోసం కొత్త చట్టాలు
- February 18, 2022
యూఏఈ: నిర్మాణ రంగ కార్మికుల భద్రత నిమిత్తం కొత్త డిక్రీని విడుదల చేశారు. 50 మంది కంటే ఎక్కువ కార్మికులున్న ఎస్టాబ్లిష్మెంట్స్ (కార్మికుల కనీస వేతనం 1,500 దిర్హాములు) వుంటే, ఖచ్చితంగా కార్మికులకు అకామడేషన్ కల్పించాలి. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎండ ప్రాంతంలో పనిచేసేందుకు నిర్మాన రంగ అలాగే ఇండస్ట్రియల్ కార్మికులను వినియోగించకూడదు. 100 మంది కంటే ఎక్కువమంది కార్మికులు పనిచేసే సంస్థలు తప్పనిసరిగా హెల్త్ మరియు సేఫ్టీ అధికారిని నియమించుకోవాలి. నిర్మాణ రంగ ప్రాంతాల్లో భద్రతని సదరు అధికారి పర్యవేక్షిస్తుండాలి. కార్మికుల భద్రతకు సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి యజమాని పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సి వుంటుంది. కార్మికులు పూర్తి భద్రత నడుమ పని చేయాలి, వారికి ఎంప్లాయర్ పూర్తి వివరాలు తెలియజేయాలి. పని ప్రాంతంలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించే కార్మికులకు పెనాల్టీ విధించే అధికారాన్ని యజమానికి కట్టబెట్టింది ఈ డిక్రీ.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







