రైతులకు శుభవార్త చెప్పిన టీటీడీ
- February 19, 2022
తిరుపతి అనగానే.. శ్రీవారి దర్శనం అనంతరం గుర్తుకొచ్చేది లడ్డూ. ఈ ప్రసాదాన్ని ప్రతొక్కరూ పరమ పవిత్రంగా భావిస్తుంటారు.
ఎవరైనా తిరుపతికి వెళ్లి వచ్చిన తర్వాత.. లడ్డూను పంచుతుంటారు. లడ్డూను మహిమాన్వితంగా భావిస్తుంటారు. ఈ లడ్డూ తయారీలో ఎన్నో పదార్థాలు వాడుతుంటారనే సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో ప్రతొక్కటి ముఖ్యమైందే. చక్కెర, నెయ్యి, జీడిపప్పు, శనగపిండి ఇతరత్రా వాడుతుంటారు. శనగపిండికి పప్పు శనగను అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు. తమకు భాగస్వామ్యం దక్కుతుందన్నందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి సిద్ధంగా సాగు చేసిస వాటినే టీటీడీ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అందుల భాగంగా శనగపప్పు పంటను సేకరించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జెడ్ బీఎస్ఎఫ్ విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో 185 ఎకరాల్లో 1, 396 క్వింటాళ్ల పప్పు శనగ పండింది. ఇటీవలే టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మా నాయక్ వెల్లడించారు. ఈయన సహకారంతో ఈ నెలాఖరుకు అవసరమైన పప్పు శనగను వెంకన్న సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పంటకు 400 కిలోల ఘన జీవామృతం, బీజా మృతంతో విత్తన శుద్ధి, ప్రతి 20 రోజులకోసారి జీవా మృతాన్ని పిచికారీ చేసి పప్పు శనగ పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, శనగపిండి లాంటి వాటితో తయారు చేసిన సేంద్రీయ పోషకాలతో పంట పండిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెలాఖరున పంట తొలగించి మార్పిడి చేసిన తర్వాత 1,396 క్వింటాళ్లు టీటీడీకి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, బహిరంగ మార్కెట్ లో ఉన్న ధర కన్నా 20 శాతం అధికంగా రైతులకు ఇవ్వడానికి టీటీడీ నిర్ణయించిందన్నారు. తిరుమల వెంకన్న ప్రసాదంలో తాము పండించిన పప్పు శనగను వినియోగించనుండడంతో రైతులు అమితానాందం పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు