విదేశాల్లో తొలి ఐఐటీ..యూఏఈలో ఏర్పాటు చేయనున్న ఇండియా
- February 20, 2022
యూఏఈ: ఇండియా-యూఏఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం పై ఫిబ్రవరి 18న సంతకాలు చేశారు. ఇండియా వెలుపల IIT స్థాపించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం, భారతదేశంలో 23 IITలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు BTech నుండి డాక్టోరల్ ప్రోగ్రామ్ల వరకు విభిన్నమైన డిగ్రీలను అందించే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు. వీటిల్లో ప్రవేశాలు దొరకడం చాలా కష్టం. ఇండియా అండ్ UAE దేశాల మధ్య వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో US $ 100 బిలియన్లకు పెంచే లక్ష్యంతో చారిత్రక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై ఇటీవల సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









