తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- February 20, 2022 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 107 కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,678 మంది కరోనా బారినపడగా వారిలో 7,77,434 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 135 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,109. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు చేశారు. క్రితం రోజుతో(401 కేసులు) పోలిస్తే కరోనా కొత్త కేసులు తగ్గాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com