గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి

- February 21, 2022 , by Maagulf
గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి

దుబాయ్: కోవిడ్ పరిమితులను సడలించడంతో బుర్ దుబాయ్‌లోని గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఆలయానికి భక్తుల రాక మొదలైందని ఆలయ జనరల్ మేనేజర్ గోపాల్ కూకాని చెప్పారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ నిబంధనల ప్రకారం.. ఆలయం ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం వరకు.. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నామన్నారు. భౌతిక దూర నిబంధనలపై సడలింపులు ఉన్నప్పటికీ, రద్దీని నివారించడానికి భక్తుల మధ్య 1.5 మీటర్ల దూర నిబంధనను కొనసాగిస్తున్నామని చెప్పారు. కోవిడ్ భద్రతా నియమాల ప్రకారం.. ఎంట్రీ/ఎగ్జిట్ గేట్ల వద్ద థర్మల్ కెమెరాలు, హ్యాండ్ శానిటైజర్లు పెట్టినట్టు తెలిపారు. జనవరి 22 నుండి దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com