భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
- February 21, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాల్సి ఉంది. సాయంత్రం 8 గంటలకు ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టుగా చెప్పడంతో మెగా అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరికీ షాకిస్తూ తాజాగా ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won't be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
“ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన మృతికి గౌరవ సూచకంగా భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగదు” అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడిపోయారు. తరువాతైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ట్రైలర్ సంగతేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం