ఏపీ కరోనా అప్డేట్

- February 21, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి:  ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది.కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 249 కరోనా పరీక్షలు చేయగా 182 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో చిత్తూరు జిల్లాలో మరొకరు మరణించారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో 950 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,16,467. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,95,768. రాష్ట్రంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,985. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14వేల 714కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,29,31,889 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com